తెలుగు లిపి పుట్టు పూర్వోత్తరాలు - భాస్కర రామిరెడ్డి

యరలవ మదనస యనుచును
బరువది నీ యక్షరములు భయనయ తతులన్
నిరతమునం వ్రాయనేర్చిన
వరకరుణా వానివ్రాలు వట్రు వలమరున్


మన దస్తూరి గుండ్రంగానూ అందంగానూ వుండడానికి మన పూర్వులెవరో ఈ గోసాయి చిట్కాను చెప్పారు. ఇప్పటి అక్షర సమామ్నయం స్వరూపం చూచి ఇది మొదటినుండి ముత్యాలకోవ అని మనం అనుకోరాదు. చిత్రాల రూపంలో వంకర టింకర గీతల రూపంలో మొదట వుంది. రాతిబండల మీద, రాగిరేకుల మీద, తాటాకుల మీద, కాగితాల మీద( ప్రత్తి కాయితాల మీద ) రాపాడగా, రాపాడగా ఇప్పటి స్వరూపం తీర్చుకున్నది మన వర్ణమాల. ఈ పరిణామానికి రెండు వేల యేండ్ల సమయం పట్టింది.

భాష అంటే కొన్ని ధ్వనుల గుంపు. ఈ ధ్వనులకు సాంకేతాలే లిపులు. ఈ లిపికి లిఖి, వర్ణం, లేఖ అక్షర అనే పర్యాయ పదాలున్నాయి. లేఖన సాధనలను బట్టి ఈ పేర్లు ఏర్పడ్డాయి. మాటా పలుకు గాలిలో కలిసిపోతాయి. దీనికి సంకేతమయిన అక్షరం చెరగనిది. రాతిపైన లోహపు రేకులమీద గీచిన గీత చెరగదు గదా! రంగుతో వ్రాయడాన్ని బట్టి వర్ణమయింది.కలంతోనో కుంచెతోనో పూయడాన్ని బట్టి లిపి,లిఖి అయింది. ఉలితోనో, గంటంతోనో గీకడం వల్ల లేఖ అయింది.

మన ఈ లిపి ప్రాచీన మయినదని, స్వతంత్రమైనదని, పలువురు ప్రాచ్య పాశ్చాత్య పండితుల అభిప్రాయం. మనకు అశోకుని కాలం నుండి శాసనాలు కనిపిస్తున్నాయి. అందుకు ముందు ఏదో విధమయిన లేఖన పద్ధతి లేకపోతే అకస్మాత్తుగా లిపి ఊడిపడదు కదా !

మిగిలిన భాగం ఇక్కడ నుండి చూడండి....

కామెంట్‌లు